Breaking News

ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరిక

జిల్లాలో ఆర్టీసీ బస్సులపై దాడులు, ధ్వంసక చర్యలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) స్నేహ మెహ్రా కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ సమాజానికి చెందిన ఉమ్మడి ఆస్తి అని, దానిపై దాడులు చేయడం తీవ్ర నేరమని ఆమె స్పష్టం చేశారు.

ఆర్టీసీ డ్రైవర్లు మరియు సిబ్బంది భద్రతకు పోలీసులు పూర్తిగా కట్టుబడి ఉన్నారని పేర్కొంటూ, విధులకు ఆటంకం కలిగించినా, బస్సులను ధ్వంసం చేసినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. బస్సులపై రాళ్లు రువ్వడం లేదా ఇతర అరాచక చర్యలకు పాల్పడే వారిని వీడియో సాక్ష్యాధారాల ఆధారంగా గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

అటువంటి చర్యలకు పాల్పడిన వారు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని కూడా స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా హింసను ప్రేరేపించే వ్యక్తులపై పోలీసులు నిఘా ఉంచుతున్నారని తెలిపారు.

మడిపెల్లి గ్రామంలో “Arrive Alive – మన ఊరు మన బాధ్యత” కార్యక్రమం.15 సీసీ కెమెరాల ఏర్పాటు…200 మందితో బైక్ ర్యాలీ…పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. శబరీష్….

యువత భావోద్వేగాలకు లోనై తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, ఏదైనా నిరసన ఉంటే శాంతియుత మార్గాల్లో వ్యక్తం చేయాలని ఎస్పీ సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 100’కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజా ఆస్తులను కాపాడాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *