Hyderabad నగరంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు ఓయూ సిటీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన బంగారు ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నార
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పులిపాటి హేమంత్ కుమార్ అలియాస్ నాను (25), పల్లె దీపక్ (26), మాల్ శంకరియ (20) కలిసి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అదనంగా దొంగిలించిన బంగారం కొనుగోలు చేసిన కందుకూరు రామాచారి (32)ను కూడా పోలీసులు పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుంచి సుమారు 35.03 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన హోండా యూనికార్న్ బైక్, దొంగిలించిన సొమ్ముతో కొనుగోలు చేసిన పల్సర్ 160 సీసీ బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు హేమంత్ కుమార్, దీపక్లపై గతంలో కూడా అనేక కేసులు నమోదై ఉన్నాయి.
ఏప్రిల్ 17న హబ్సిగూడ ప్రాంతంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకుని, బైక్పై వచ్చిన నిందితులు బలవంతంగా గొలుసును లాక్కొని పరారయ్యారు. అనంతరం ఆ గొలుసును మూడు ముక్కలుగా చేసి పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఓయూ సిటీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ ఆపరేషన్ను టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జె. రాజశేఖర్, ఓయూ సిటీ ఎస్హెచ్ఓ ఎం. మహేష్, డిఐ లెనిన్ బాబు మరియు పోలీస్ బృందం విజయవంతంగా నిర్వహించారు.
