Breaking News

బోయినపల్లి పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ మహేష్ బి. గితే ఆకస్మిక తనిఖీ – సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహనకు ఆదేశాలు

Mahesh B. Githe మంగళవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తులో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా, పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి, నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించా

పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ సమగ్ర భద్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. తెలియని కాల్స్, సందేశాలు, లింకులు, OTP వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించి, నేరాల నియంత్రణలో వాటి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు.

దేవరకొండ SBI-ACB బ్రాంచ్‌లో భారీ మోసం బహిర్గతం – రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం, నలుగురు అరెస్ట్

అలాగే గంజాయి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ రమాకాంత్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *