ఏప్రిల్ 14, 2026 మంగళవారం, రాజేంద్రనగర్ జోన్ డిసిపి ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి కాలనీ, మాలిక రాయల్ టెర్రస్ అపార్ట్మెంట్లో డోర్-టు-డోర్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిసిపి కాలనీ వాసులతో నేరుగా మట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.
మొబైల్ ఫోన్లకు వచ్చే తెలియని లేదా అనుమానాస్పద APK ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని హెచ్చరించారు. పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు తెలియని యాప్లు లేదా ఫైళ్లు డౌన్లోడ్ చేయకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే లాటరీలు లేదా ఇతర స్కీమ్లపై నమ్మకం పెట్టుకొని మోసపోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే తొలి రెండు గంటలు ‘గోల్డెన్ అవర్’గా భావించబడతాయని, ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలకు గురైన వారు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మైలార్దేవ్పల్లి ఎస్హెచ్ఓ సత్యనారాయణ, డీఐ మక్సూద్ అలీ, ఎస్ఐపీ విశ్వనాథ్ రెడ్డి, ఏఎస్ఐ లాల్యా నాయక్, సోమయ్య, సైబర్ వారియర్ చందన (డబ్ల్యూపీసీ 194), బ్లూ కోల్ట్స్ సిబ్బంది మరియు సుమారు 25 మంది కాలనీ వాసులు పాల్గొన్నారు.
