
మహబూబ్నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB)లో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మొయిజుద్దీన్ ఏఎస్ఐ (ASI) నుండి ఎస్సై (SI)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ఆయనకు పదోన్నతి చిహ్నాన్ని తన చేతుల మీదుగా బహుకరించారు.
మొహమ్మద్ మొయిజుద్దీన్ 1989 సంవత్సరంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో పోలీస్ కానిస్టేబుల్గా సేవలో ప్రవేశించి, అలంపూర్, తిమ్మాజిపేట్, జడ్చర్ల, పెద్దకొతపల్లి, కోస్గి పోలీస్ స్టేషన్లలో కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. అనంతరం 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2018లో ఏఎస్ఐగా పదోన్నతులు పొందారు. DCRB, CCS మహబూబ్నగర్, హన్వాడ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సేవలందించి, ప్రస్తుతం కోయిలకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
తన విశిష్ట సేవలకు గాను ఇప్పటివరకు 70 కాష్ రివార్డులు, 18 GSEలు, 12 ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అదేవిధంగా 2013లో సేవా పతకం, 2017లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం, 2019లో ఉత్తమ పోలీస్ పతకం, 2025లో IPM మెడల్ను అందుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ, “ మొయిజుద్దీన్ క్రమశిక్షణ, అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత ప్రశంసనీయం. ఈ పదోన్నతి ఆయన దీర్ఘకాల సేవలకు లభించిన గౌరవం” అని అభినందించారు. అలాగే పదోన్నతి తోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని తెలిపారు.
