ఇరాన్ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో దిల్లీ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగానే వెనక్కి తిరిగివచ్చింది. మరో వైపు ఇరాన్ సైతం తమ గగనతలాన్ని మూసివేసింది. మరో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది.
