బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
International

నిద్రలో నుంచి లేచిన ట్రంప్ కాక

నిద్రలో నుంచి లేచిన ట్రంప్ కాక

అమెరికా క్రికెట్ జ‌ట్టుకు ట్రంప్ శుభాకాంక్ష‌లు
ఓట‌మి త‌ర్వాత అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ విషెస్‌
ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న జ‌ట్టుకు అభినంద‌న‌లు
సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డి
లేటుగా స్పందించినందుకు పేలుతున్న జోకులు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ జ‌ట్టు ఒక మ్యాచ్ ఆడ‌టం అయ్యింది.. ఓడ‌టం కూడా జ‌రిగింది. ఈ నేప‌త్యంలో ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ చాలా లేట్‌గా నిద్ర‌లేచిన‌ట్టుంది.

వారి జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొంటున్న విష‌యం చాలా లేట్ తెలుసుకొని.. లేట్‌గా స్పందించారు.

శనివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది.

ఓడిపోయిన జట్టుకు, అది కూడా మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వారి జ‌ట్టుకు శుభాకాంక్షలు చెప్పారు. తమ క్రికెట్ టీమ్‌కు అమెరికా మొత్తం అండగా నిలుస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ‘

భారత్‌ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోందని ఇప్పుడే తెలిసింది. ఈ టోర్నీలో ఆడుతున్న అమెరికా జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. మన దగ్గర బలమైన జట్టు ఉంది, దేశమంతా మీ వెంటే ఉంది.’అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

57% మార్కుల నుంచి ఐపీఎస్‌ వరకు.. సమీర్‌ శర్మ స్ఫూర్తిదాయక ప్రయాణం

అయితే ఈ టోర్నీ ప్రారంభమై 24 గంటల తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

అంతేకాకుండా అమెరికా తమ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాత ట్రంప్ విషెస్ చెప్పడంపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి.

అయితే అమెరికా టీమ్ శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియాకు చుక్కలు చూపించింది. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాణించ‌డంతో భారత్ 161 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.

ట్రంప్ విషెస్ ఆలస్యమైనా.. అమెరికా జట్టు ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.