Breaking News

కొండమల్లె పల్లి పోలీస్ స్టేషన్ ను అర్ధ రాత్రి ఆకస్మిక తనిఖీ – జిల్లా ఎస్పీ.

ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి. సి.సి.టి.విల ఏర్పాటు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కొండమల్లె పల్లి పోలీస్ స్టేషన్ ను అర్ధ రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు,స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో నేర నియంత్రణలో భాగంగా సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు,రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,అక్రమ ఇసుక,పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోని నియంత్రించాలని అన్నారు. ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పని చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట కొండమల్లె పల్లి సి.ఐ నవీన్ కుమార్, యస్.ఐ అజ్మీరా రమేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం: షీ టీమ్స్ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్స్ శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *