బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Hyderabad

అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్, భారీగా మొబైల్ విడిభాగాలు స్వాధీనం

అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్, భారీగా మొబైల్ విడిభాగాలు స్వాధీనం

హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో వరుస మొబైల్ ఫోన్ దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు ఛేదించారు. సమన్వయంతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి భారీ మొత్తంలో మొబైల్ ఫోన్లు, విడిభాగాలు, నేరానికి ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15-04-2026న సయ్యద్ నజీర్ అహ్మద్ అనే వ్యక్తి డీఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ సమీపంలో వెళ్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు ఆయన వద్ద ఉన్న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్-5 మొబైల్ ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కంచన్‌బాగ్ పోలీసులు క్రైమ్ నెం.78/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన నిందితులు అంబటి నరేష్ అలియాస్ కావటి నరేష్, బనాలా అరుణ్ కుమార్ అలియాస్ నాని, మేకల చిరంజీవి అలియాస్ చిరు, తోట సూరి అలియాస్ సురేష్ అలియాస్ సూర్య, తోట చందు, సందీప్ జైస్వాల్‌గా గుర్తించారు. మరో ముగ్గురు నిందితులు తోట వసంత్, శశి, ప్రేమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ముఠా సభ్యులు బస్సు స్టాప్‌లు, మార్కెట్‌లు, టిఫిన్ సెంటర్లు, ఆర్‌టీసీ బస్ స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని మోటార్ సైకిళ్లపై తిరుగుతూ దొంగతనాలకు పాల్పడేవారు. ముఖ్యంగా వృద్ధులు, బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వార్తాపత్రికలు లేదా కవర్లతో ముఖాలను కప్పి మొబైల్ ఫోన్లను చాకచక్యంగా దొంగిలించేవారని పోలీసులు తెలిపారు. కొన్నిసార్లు బాధితుల దృష్టి మళ్లించేందుకు కరెన్సీ నోట్లు కిందపడేసి గందరగోళం సృష్టించి మొబైల్ ఫోన్లు కొట్టేసేవారు.

దొంగిలించిన మొబైల్ ఫోన్లను రూ.1500 నుంచి రూ.2000 వరకు రిసీవర్లకు అమ్మి, కొన్ని ఫోన్లను విడిభాగాలుగా విడదీసి మొబైల్ రిపేర్ షాపులకు విక్రయించేవారని విచారణలో బయటపడింది.

పోలీసులు నిందితుల వద్ద నుండి 132 మొబైల్ బ్యాటరీలు, 172 మొబైల్ బాడీలు, 73 కెమెరా విడిభాగాలు, 14 స్మార్ట్ ఫోన్లు, ఒక బజాజ్ పల్సర్ బైక్, మొబైల్ పౌచ్‌లు మరియు ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

అరెస్టైన నిందితులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అనేక దొంగతనం, చీటింగ్, ఎన్‌డీపీఎస్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజలు రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. అలాగే సరైన బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.