Breaking News

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి – ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

సంగారెడ్డి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో పోలీసు అధికారుల నుండి హోంగార్డుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులకు ఈ విధమైన క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. ఈ టోర్నమెంట్‌లో వందకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొంటూ, అందరూ క్రీడా స్ఫూర్తితో పోటీపడి మంచి ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లకు ఎంపిక చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం తో పాటు విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

మహబూబాబాద్ జిల్లాకు 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *