బోయినపల్లి: పోలీస్ శాఖలో నాలుగు దశాబ్దాలపాటు విశిష్ట సేవలందించిన ఏఎస్ఐ కొమురయ్య పదవీ విరమణ పొందగా, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
1985లో కానిస్టేబుల్గా సేవలు ప్రారంభించిన కొమురయ్య, 41 సంవత్సరాలపాటు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏఎస్ఐ పదవికి ఎదిగి విశేష సేవలందించారు. ప్రస్తుతం బోయినపల్లి పోలీస్ స్టేషన్లో సేవలందిస్తూ పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, కొమురయ్య అందించిన సేవలు పోలీస్ శాఖకు గర్వకారణమని కొనియాడారు. ప్రజలకు నిబద్ధతతో సేవలు అందించడంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఎస్పీ సూచించారు. అవసరమైతే పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్, కొమురయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
