Breaking News

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.

నో హెల్మెట్.. నో పెట్రోల్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలి.

రాబోయే మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ అధికారులంతా బాధ్యతగా పని చేయాలి.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు తప్పకుండా శిక్ష పడేలా కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కేసుల విచారణలో ఎలాంటి జాప్యం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు.పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రాసిక్యూషన్‌లో భాగంగా కోర్టు వారు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై, తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా అధికారులు అందరూ బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా పరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరారు.

• సిగాచి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ జుడీషియాల రిమాండుకు తరలింపు..

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని,ప్రతి రోజు రౌడి,హిస్టరీ షీటర్స్ ని తనిఖీ చేస్తూ వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గంజాయి వంటి మత్తు పదార్ధాలు , మట్కా , జూదం , అక్రమ ఇసుక రవాణా లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్,బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన సేవనంపై కఠినంగా వ్యవహరించాలని,పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు.Arrive alive కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వాహనదారులకు , ప్రజలకు , విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, నో హెల్మెట్ నో పెట్రోల్ పై వాహనదారులకు అవగాహన కల్పించాడంతో పాటుగా పెట్రోల్ బంక్ ల వద్ద నో హెల్మెట్..నో పెట్రోల్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలన్నారు.

ఈసమావేశంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి,అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వేంకటేశ్వర్లు, శ్రీనివాస్, డిసిర్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, పిసిఆర్ ఇన్స్పెక్టర్ మధుకర్, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *