బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Hyderabad

సంక్రాంతి పండగ ముగించుకొని తిరుగు ప్రయాణ రద్దీ దృష్ట్యా సమగ్ర ట్రాఫిక్ ఏర్పాట్లు– జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

సంక్రాంతి పండగ ముగించుకొని తిరుగు ప్రయాణ రద్దీ దృష్ట్యా సమగ్ర ట్రాఫిక్ ఏర్పాట్లు– జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా పరిధిలో సంక్రాంతి పండగ ముగించుకుని ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ దిశగా తిరుగు ప్రయాణాలు అధికంగా సాగుతున్న నేపథ్యంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ సమగ్ర చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ముఖ్య కూడళ్లలో 450 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామని తెలిపారు.

వాహన రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు డ్రోన్ల ద్వారా గాలిలో నుంచే నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ, రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట్ల వెంటనే ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అధికంగా ప్రయాణించే నేషనల్ హైవేలు, టోల్ ప్లాజాలు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం

ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న సమయాల్లో వాహనాల గమనాన్ని సజావుగా కొనసాగించేందుకు అవసరమైతే మార్గమళ్లింపులు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా అవసరమున్న చోట్ల మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ప్రమాదకర ఓవర్‌టేకింగ్ వంటి వాటిపై కఠిన నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకోవాలని, నిరంతర డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు లేదా అత్యవసర సహాయం అవసరమైనప్పుడు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ / 100 ను సంప్రదించాలని తెలిపారు.

పండగ అనంతరం తిరుగు ప్రయాణాలు చేసే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీస్ శాఖకు సహకరించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు..