నల్గొండ: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త, ఆర్థికవేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రాంతీయ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన విలువలను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివ ప్రసాద్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, మహిళా పోలీసు సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళులు అర్పించారు.
