Breaking News

అర్ధరాత్రి వేళ మహిళకు అండగా నిలిచిన కామాఠిపుర పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు (బక్రీద్ చెక్‌పోస్ట్) వద్ద అర్ధరాత్రి సమయంలో మానసిక వేదనతో దుస్తులు లేకుండా తిరుగుతున్న ఒక మహిళను గమనించిన కామాఠిపుర పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించారు. కామాఠిపుర ఇన్‌స్పెక్టర్ బి. ప్రసాద్‌రావు తన పోలీస్ యూనిఫామ్ షర్ట్‌తో పాటు ఒక పంచను ఆమెకు అందించి గౌరవాన్ని కాపాడారు. రాత్రి వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆమెను చెక్‌పోస్ట్ వద్ద సురక్షితంగా ఉంచి ఆశ్రయం కల్పించారు. రాజేంద్రనగర్ ఏసీపీ కిషోర్ పర్యవేక్షణలో ఎస్‌హెచ్‌ఓ బి. ప్రసాద్‌రావు, ఏఎస్ఐ అన్వర్ హుస్సేన్, కానిస్టేబుల్ సుమన్ ఈ చర్యల్లో పాల్గొన్నారు. మహిళా రక్షణ, సామాజిక బాధ్యతల పట్ల కామాఠిపుర పోలీసుల సేవా భావాన్ని స్థానికులు, వాహనదారులు ప్రశంసిస్తున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం ‘సాక్ ఐ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *