బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Telangana

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైతన్య మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు వెల్లడించారు.

ఒంగోలు జిల్లా పొర్సిపాడు మండలం మ్యాదరమెట్ల గ్రామానికి చెందిన చైతన్య మణికంఠ ప్రస్తుతం వేములవాడ తేలుకుంట ఇంద్రనగర్‌లో నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా బోయినపల్లి, జమ్మికుంట ప్రాంతాల్లో దేవాలయ చోరీ కేసుల్లో జైలుశిక్ష అనుభవించినప్పటికీ అతనిలో మార్పు రాలేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలో తన బంధువులైన బోదాసు యాదగిరి, కొమిరె శ్రీనుతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. 2026 జనవరి 21న తంగళ్లపల్లి గ్రామానికి వెళ్లి రెక్కీ నిర్వహించిన ముగ్గురు, మరుసటి రోజు తెల్లవారుజామున దేవాలయానికి చేరుకుని యాగశాల తాళం బండరాయితో పగులగొట్టి అందులో ఉన్న పంచలోహ గరుడ వాహనాన్ని అపహరించి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్

ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 19న వాహన తనిఖీల సందర్భంగా పాత నేరస్థుడైన చైతన్య మణికంఠపై అనుమానం రావడంతో పోలీసులు విచారించగా, తాను మరో ఇద్దరితో కలిసి చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఎస్సై ఉపేంద్ర చారి, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుళ్లు సంపత్, శ్రావణ్‌లను సీఐ అభినందించారు.