సంగారెడ్డి: సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ)లో 2025 సంవత్సరానికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ (SI), అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI), కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్ మాట్లాడుతూ అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్లు www.recruitment.ssb.gov.in లేదా https://ssb.gov.in ను సందర్శించాలని తెలిపారు.
ఈ పోస్టులు OC, BC, SC, ST, EWS రిజర్వేషన్ నిబంధనల ప్రకారం భర్తీ చేయబడతాయని తెలిపారు. అభ్యర్థులు విద్యార్హతలు, వయస్సు పరిమితి మరియు ఇతర అర్హత ప్రమాణాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, పరీక్షల తేదీలు మరియు ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
