Breaking News

ఆర్టీసీ సమ్మె శాంతియుతంగా జరగాలి: అల్లర్లు చేస్తే కఠిన చర్యలు – ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చట్టం, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. సమ్మె ప్రజాస్వామ్యపరమైన హక్కు అయినప్పటికీ, అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.

సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మరియు అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్, రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, లేదా ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి విధుల్లో చేరినా వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బస్సుల రాకపోకలు, డిపోలు, ముఖ్య కూడళ్లు, బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసినా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మడిపెల్లి గ్రామంలో “Arrive Alive – మన ఊరు మన బాధ్యత” కార్యక్రమం.15 సీసీ కెమెరాల ఏర్పాటు…200 మందితో బైక్ ర్యాలీ…పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. శబరీష్….

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వదంతులు వ్యాప్తి చేసే వారిపైనా పోలీసులు నిఘా ఉంచుతున్నారని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సమ్మెలో పాల్గొనే కార్మికులు మరియు ప్రజలు పరస్పర గౌరవంతో వ్యవహరిస్తూ ఎలాంటి ఉద్రిక్తతలకు తావు ఇవ్వకుండా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *