Breaking News

గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ముగ్గురికి గాయాలు

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వద్దిరెడ్డిగూడెం గ్రామ శివారులో గురువారం సాయంత్రం సుమారు 4:20 గంటల సమయంలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం, అలుగుబెల్లి జైపాల్ రెడ్డి నడుపుతున్న TS 05 FP 2277 నెంబర్ గల కియా సెల్టోస్ కారులో మరెడ్డి బాల్ రెడ్డి, మరెడ్డి అలివేలు, మాలె వెంకటమ్మ, మాలె మంజుల నల్లగొండలో జరిగిన కార్యక్రమానికి హాజరై దేవరకొండ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో మల్లేపల్లి వైపు నుండి గుర్రంపోడు వైపు వస్తున్న TS 05 EV 2192 నెంబర్ గల స్ప్లెండర్ బైక్‌ను కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న నర్సింగ్ ధనుంజయ, నర్సింగ్ మధుబాబు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కారులో ఉన్న మరెడ్డి బాల్ రెడ్డి కూడా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరెడ్డి అలివేలు, మాలె వెంకటమ్మ, మాలె మంజుల గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు.

మడిపెల్లి గ్రామంలో “Arrive Alive – మన ఊరు మన బాధ్యత” కార్యక్రమం.15 సీసీ కెమెరాల ఏర్పాటు…200 మందితో బైక్ ర్యాలీ…పాల్గొన్న జిల్లా ఎస్పీ డా. శబరీష్….

సంబంధిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *