బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Hyderabad

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ – స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనర్

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ – స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనర్

హైదరాబాద్ నగరంలో H-CITI Project ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు.

ఈ ట్రయల్ రన్‌ను నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జాయింట్ సీపీ ట్రాఫిక్ డి. జోయల్ డెవిస్తో కలిసి కేబీఆర్ మెయిన్ గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్ మరియు అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రయల్ నిర్వహించినట్లు సీపీ తెలిపారు.

హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

ఈ వన్‌వే ట్రయల్ రన్ ఆదివారం ఒక్కరోజే నిర్వహించగా, రేపటి నుంచి ట్రాఫిక్ యథావిధిగా కొనసాగనుంది. ట్రయల్ సమయంలో గమనించిన అంశాలను విశ్లేషించి నివేదికను GHMCకు పంపనున్నట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చి మళ్లీ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అభివృద్ధి పనుల కారణంగా కలిగే అసౌకర్యానికి పోలీసులు మరియు ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ, ప్రజలు సహకరించాలని కోరారు.