రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20: దొంగతనం కేసులో నేరం రుజువైన నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ మేరకు పట్టణ సీఐ కృష్ణ వివరాలు వెల్లడించారు.
సిరిసిల్ల పట్టణంలోని వెంకటరావునగర్కు చెందిన దూడం శంకర్ పవర్లూమ్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. 2025 అక్టోబర్ 7వ తేదీ రాత్రి, తన ఇంటి కాంపౌండ్లో ఉన్న సుమారు 6,000 రూపాయల విలువైన నాలుగు ఇనుప తాలీలు దొంగతనానికి గురయ్యాయి. బాధితుడు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఇందిరానగర్కు చెందిన పడిగెల లక్ష్మణ్ గోడ దూకి లోపలికి ప్రవేశించి వాటిని దొంగిలించినట్లు గుర్తించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కే. వినీత రెడ్డి కేసు నమోదు చేసి, నిందితుడు పడిగెల లక్ష్మణ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. సీఎంఎస్ ఎస్సై శ్రావణ్ పర్యవేక్షణలో, కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ఈ కేసులో ఆరుగురు సాక్షులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేలుమల సందీప్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్, నిందితుడు పడిగెల లక్ష్మణ్పై నేరం రుజువు కావడంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు
