Breaking News

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ.. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా, ఆమె ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన పరిధిలో త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని సూచించారు.

నకిలీ కరెన్సీ ముఠా బట్టబయలు.. ఇద్దరు అరెస్ట్, ప్రింటర్-స్కానర్ సహా సామగ్రి స్వాధీనం

అలాగే, పోలీస్ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఫిర్యాదులను స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నారని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ప్రజలతో పోలీస్ శాఖ మధ్య మరింత సాన్నిహిత్యం పెంపొందించే లక్ష్యంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *