Breaking News

295 బోగీల వాసుకి.

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వే పేరుగాంచింది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మండి ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనపై.. అలాగే ప్రకృతి మధ్యలో నుంచి వెళ్లే రైళ్లు ఉన్నాయి. ఈ కోవలోనే భారతదేశంలో అత్యంత పొడవైన రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. సాధారణంగా ఓ గూడ్స్ రైలుకు 25.. లేదా మహా అయితే 50 బోగీలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ రైలుకు ఉన్నది ఏకంగా 295 బోగీలు.. ఈ భారీ అనకొండను లాగేందుకు 6 ఇంజిన్‌లు పని చేస్తాయి. ఇంతకీ అదేంటంటే..

సూపర్ వాసుకి.. ఈ కార్గో రైలు పొడవు సుమారు 3.5 కిలోమీటర్లు. ఈ రైలుకు 15-20 కాదు ఏకంగా 295 కోచ్‌లు ఉన్నాయి. ఇక ఆ కోచ్‌లను లాగేందుకు 6 లోకోమోటివ్ ఇంజిన్లు పని చేస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ రైలు ఏ స్టేషన్ నుంచైనా దాటాలంటే.. దాదాపుగా గంట సమయం పడుతుంది. ఈ సూపర్ వాసుకి ట్రైన్ ద్వారా దేశంలోని వివిధ గనుల నుంచి సేకరించిన బొగ్గు పెద్ద విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేయబడుతుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు సుమారు 27 వేల టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది.

ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరాన్ని సూపర్ వాసుకి ట్రైన్ దాదాపు 11.20 గంటల్లో కవర్ చేస్తుంది. శివుడి మెడలోని వాసుకి సర్పం పేరును ఈ రైలుకు పెట్టారు. వాసుకిని పాముల రాజుగా పిలుస్తారు. దేవతులు, రాక్షసుల మధ్య సాగరాన్ని మథించడానికి తాడుకు బదులుగా వాసుకిని ఉపయోగించారు. ఈ పొడవైన రైలు కూడా కదులుతున్నప్పుడు, అచ్చం వాసుకి పాములా కనిపిస్తుందట.

కొత్త సీఎంకు మా మద్దతు ఉంటుంది: కేజీవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *