బ్రేకింగ్ న్యూస్
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణహత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానాప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణ
Hyderabad

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానా

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష – రూ.10,000 జరిమానా

హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, ఆగస్టు 4: బండ్లగూడ పోలీస్ స్టేషన్ (గతంలో చాంద్రాయణగుట్ట) పరిధిలో 2023లో జరిగిన హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ నాంపల్లిలోని 4వ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం (03-08-2026) తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

పోలీసుల వివరాల ప్రకారం, 2023 జనవరి 18న రాత్రి 10:40 గంటల సమయంలో ముంతాజ్ బాగ్‌లోని విద్యుత్ కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తిపై బండరాయితో దాడి జరిగినట్లు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సహాయంతో పరిశీలించగా బాధితుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం. 52/2023గా ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో నిందితుడు వేముల రాజు (38), కూలీ, జల్‌పల్లి, బాలాపూర్ నివాసిగా గుర్తించారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర: ట్రాఫిక్ సిబ్బందికి డిసిపి అవినాష్ కుమార్ దిశానిర్దేశం

ఈ కేసులో ఎస్సై జి. ఆంజనేయులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇన్‌స్పెక్టర్ ఎ. మధుసూదన్ రెడ్డి తొలి దర్యాప్తు నిర్వహించారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ కె.ఎన్. ప్రసాద్ వర్మ ఛార్జిషీట్ దాఖలు చేశారు. న్యాయస్థానంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. శ్రీవాణి ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించగా, లీగల్ కౌన్సెలర్ సురేష్ కుమార్ శర్మ సహకరించారు.

కేసులో కీలక సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించడంలో కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎ. ఆంజనేయులు (పీసీ-6808), సమన్స్/వారెంట్ల అమలులో ఛత్రీ శశిధర్ (పీసీ-3758)తో పాటు దర్యాప్తు బృందం చేసిన కృషిని ఉన్నతాధికారులు మరియు బండ్లగూడ ఇన్‌స్పెక్టర్ ఆర్. దేవేందర్ అభినందించారు.