బ్రేకింగ్ న్యూస్
ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణసికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర: ట్రాఫిక్ సిబ్బందికి డిసిపి అవినాష్ కుమార్ దిశానిర్దేశంప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిదర్యాప్తు నాణ్యత, రికార్డుల నిర్వహణ, చట్టాలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలి – జిల్లా ఎస్పీ డా. శబరీష్ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదుఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణబాలానగర్, రాజాపూర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా ఎస్పీ డి. జానకిఆపరేషన్ ముస్కాన్–XII: నల్లగొండ జిల్లాలో 124 మంది చిన్నారులకు రక్షణ.. 108 కేసులు నమోదువిజయవంతంగా ముగిసిన “ఆపరేషన్ ముస్కాన్–XII”.. 40 మంది చిన్నారులకు రక్షణసికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర: ట్రాఫిక్ సిబ్బందికి డిసిపి అవినాష్ కుమార్ దిశానిర్దేశం
Telangana

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

వికారాబాద్, ఆగస్టు 3: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల నుంచి వచ్చిన 58 మంది బాధితులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రతి బాధితుడి ఫిర్యాదును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరంగా, నిష్పాక్షికంగా విచారణ నిర్వహించి, త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసం, ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం – అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి

పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డేను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ప్రజా సమస్యలకు త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కారం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.