బ్రేకింగ్ న్యూస్
చోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలితెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించిన నల్గొండ జిల్లా పోలీసులుఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సంగారెడ్డి అదనపు ఎస్పీసిరియల్ ఇళ్ల దొంగతనాల ముఠా అరెస్ట్.. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనంప్రశాంతమైన జీవన విధానం అలవర్చుకోవాలి: మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్విద్యార్థి దశ నుంచే సైబర్ మోసాలకు ఫుల్ స్టాప్.. సైబర్ సురక్షిత తెలంగాణ నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
SANGA REDDY DIST

పోక్సో, అత్యాచార బాధితులకు అండగా “భరోసా”.. 10వ ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ పరితోష్ పంకజ్

పోక్సో, అత్యాచార బాధితులకు అండగా “భరోసా”.. 10వ ఆవిర్భావ వేడుకల్లో ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి హాజరై భరోసా సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాల నేపథ్యంలో వర్మ కమిటీ సిఫార్సులు, నిర్భయ ఘటన అనంతరం పోక్సో, అత్యాచార బాధిత మహిళలకు అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో 2016 మే 7న తెలంగాణలో తొలి భరోసా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

గత 10 ఏళ్లుగా పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. ఫిర్యాదు నమోదు నుంచి కోర్టు తుది తీర్పు వచ్చే వరకు మెడికో-లీగల్ సేవలు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పరిహారం వంటి అన్ని సేవలను ఒకే చోట అందిస్తూ తెలంగాణ భరోసా సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

ప్రస్తుత ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ చారుసిన్హా ఆధ్వర్యంలో శిక్షణ పొందిన భరోసా సిబ్బంది బాధిత మహిళలకు ధైర్యం నింపుతూ, మెడికల్, లీగల్, కౌన్సెలింగ్, కాంపెన్సేషన్ సేవలను అందిస్తూ సత్వర న్యాయం జరిగేలా పనిచేస్తున్నారని కొనియాడారు.

అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార కేసుల బాధితులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, చిన్న సమాచారం అందిన వెంటనే భరోసా సిబ్బంది బాధితుల వద్దకు చేరుకుని అన్ని రకాల సహాయం అందిస్తారని తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

సంగారెడ్డి ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం

సంగారెడ్డి జిల్లా భరోసా సేవల కింద ఇప్పటివరకు 688 పోక్సో కేసులు, 85 అత్యాచార కేసులు, 162 కిడ్నాప్ కేసులతో కలిపి మొత్తం 935 కేసులకు సేవలు అందించారు. 175 అవగాహన కార్యక్రమాలు, 249 హోమ్ విజిట్స్, 531 వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే మిషన్ వాత్సల్య స్కాలర్‌షిప్ ద్వారా 24 మందికి రూ.6.40 లక్షలు అందజేయగా, 468 మంది బాధితులకు మొత్తం రూ.1.83 కోట్ల పరిహారం అందించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పూలబాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.