Government of Telangana ప్రకటించిన 2025 సంవత్సరానికి గాను “కఠిన సేవా” పథకంలో గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ లోడిగ రవీందర్ ఎంపికయ్యారు. ఈ అవార్డును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ చేతుల మీదుగా ఘనంగా అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్ సీఐ రవీందర్ను అభినందిస్తూ, విధి నిర్వహణలో ఆయన చూపుతున్న క్రమశిక్షణ, నిబద్ధత ప్రశంసనీయమని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో, నేర నియంత్రణలో, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలందిస్తూ మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
