Breaking News

విడి నూనె విక్రయాలపై కఠిన చర్యలు – 15 రోజుల్లో మార్పు లేకపోతే కేసులు: డీసీపీ హెచ్చరిక

Hyderabad City Police ప్రజారోగ్యానికి హాని కలిగించే విడి నూనె (Loose Oil) విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టింది. నగరంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన H-FAST (Hyderabad Food Adulteration and Surveillance Team) ఆధ్వర్యంలో బేగంబజార్‌లో నూనె తయారీదారులు, సరఫరాదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సమావేశంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్ డీసీపీ మరియు H-FAST ఇన్‌ఛార్జ్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వ్యాపారులకు కీలక సూచనలు ఇచ్చారు. వంట నూనెల వ్యాపారంలో చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

వ్యాపారులు తమ విధానాలను మార్చుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఈ గడువులోగా విడి నూనె విక్రయాలను పూర్తిగా నిలిపివేసి, ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ నిబంధనలు 100 శాతం అమలు చేయాలని ఆదేశించారు. గడువు తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు ఆహార భద్రత చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పద్మారావు నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదనం – ఇద్దరు నిందితులు అరెస్ట్

ప్రతి నూనె ప్యాకెట్ లేదా టిన్ సీల్ చేసి ఉండాలని, తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్ మరియు FSSAI లైసెన్స్ వివరాలు స్పష్టంగా ఉండాలని సూచించారు. నూనెలలో కల్తీ చేయడం, హానికర రసాయనాలు వాడడం వంటి చర్యలకు పాల్పడితే లైసెన్స్ రద్దుతో పాటు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అలాగే తయారీ మరియు నిల్వ కేంద్రాల్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అని తెలిపారు.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వ్యాపారులు లాభాల కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వినియోగదారులు కూడా తక్కువ ధరల పేరుతో విడి నూనె కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా కల్తీ అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో H-FAST అధికారులు మరియు నగరంలోని నూనె వ్యాపారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *