Breaking News

బాలానగర్ పోక్సో కేసు: నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Kukatpallyలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు.

ఈ కేసు 2017లో Balanagar పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు కొర్ర శివశంకర్ అలియాస్ రాజు (41), కూలీగా పనిచేస్తూ యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని ఎల్.ఎన్ నగర్‌లో నివసించేవాడు. ఇతని స్వస్థలం Anantapur సమీపంలోని తుమ్మలాల్ గ్రామం.

నిందితుడు ఒక చిన్నారిపై లైంగిక దాడికి యత్నించడం తో పాటు, ఆమెను అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసులు POCSO Act మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సుదీర్ఘ విచారణ అనంతరం, కోర్టు IPC సెక్షన్ 376 r/w 511 కింద 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా, అలాగే IPC సెక్షన్ 342 కింద రూ.1,000 జరిమానా విధించింది.

విద్యార్థులు సామాజిక బాధ్యతతో ఎదగాలి: బాలానగర్ సీఐ నర్సింహా రాజు

ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోషి కుమారి సమర్థవంతంగా వాదనలు వినిపించగా, దర్యాప్తు అధికారి పి. భిక్షపతిరావు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత బాలానగర్ SHO టి. నరసింహరాజు సహా పోలీస్ సిబ్బంది కృషిని ఉన్నతాధికారులు అభినందించారు.

ఈ తీర్పు ద్వారా మహిళలు, చిన్నారులపై నేరాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *