Breaking News

విద్యార్థులు సామాజిక బాధ్యతతో ఎదగాలి: బాలానగర్ సీఐ నర్సింహా రాజు

Medchal–Malkajgiri districtలో తెలంగాణ ప్రభుత్వ ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా Balanagar మండలంలోని బీసీ బాలుర వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

వెల్ఫేర్ ఆఫీసర్ కమల్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలానగర్ సీఐ నర్సింహా రాజు, సహాయ అభివృద్ధి అధికారి గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధికారులు హాస్టల్‌ను పరిశీలించి విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, భోజన నాణ్యత, బోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానంతో కాకుండా చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నేటి యువత రేపటి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ముఖ్యంగా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

బాలానగర్ పోక్సో కేసు: నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

అలాగే పెరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, కేవైసీ అప్‌డేట్, లక్కీ డ్రా పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ఎలాంటి సైబర్ మోసం జరిగినా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *