Breaking News

తమిళనాడు ఎన్నికల బందోబస్తుకు వెళ్తున్న హోమ్ గార్డులకు కిట్లు పంపిణీ – ఎస్పీ పరితోష్ పంకజ్ సూచనలు

వార్త:
తమిళనాడు రాష్ట్రంలో జరుగనున్న సాదారణ ఎన్నికల బందోబస్తు విధులకు సంగారెడ్డి జిల్లా నుండి వెళ్తున్న హోమ్ గార్డ్ సిబ్బందికి మెడికల్ మరియు కనీస అవసరాల కిట్లను పంపిణీ చేశారు.

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 38 మంది హోమ్ గార్డ్ సిబ్బందికి ఈ కిట్లు అందజేశారు. ఈ కిట్లలో ప్రాథమిక ఔషధాలు, బిస్కెట్లు, వ్యక్తిగత అవసరాల సామగ్రి వంటి అవసరమైన వస్తువులు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, ఎన్నికల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, సిబ్బంది క్రమశిక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉండడంతో సిబ్బంది బాగోగులను దృష్టిలో ఉంచుకుని ఈ కిట్లు అందిస్తున్నామని తెలిపారు.

విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, ఏ పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఆరోగ్య సమస్యలు ఎదురైతే సంగారెడ్డి జిల్లా పోలీస్ డ్యూటీ డాక్టర్‌ను నేరుగా సంప్రదించాలని, విధి లేదా వ్యక్తిగత సమస్యలు ఉన్నా సంబంధిత అధికారుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎ.ఆర్ డిఎస్పీ నరేందర్, పోలీస్ డ్యూటీ డాక్టర్ జ్యోతి, డానియెల్ (ఆర్ఐ హోమ్ గార్డ్స్), ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రావ్, బందోబస్తు విధులకు వెళ్తున్న ఆర్‌ఎస్‌ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *