బ్రేకింగ్ న్యూస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్హైదరాబాద్‌లో 38 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదంనాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన విషయాలు.. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల అరెస్ట్‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన ప్రిన్సిపల్ హత్య మిస్టరీకేసుల సత్వర పరిష్కారం, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్హై-పవర్డ్ కమిటీ చర్లపల్లి ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ సందర్శనప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలిప్రతి పిటిషన్‌ను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్
Telangana

తంగళ్ళపల్లి పోలీసులకు పెద్ద సక్సెస్…ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్!

తంగళ్ళపల్లి పోలీసులకు పెద్ద సక్సెస్…ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్!

సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి పోలీసులకు కీలక విజయం లభించింది. అంతర్ జిల్లా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై రూరల్ సి.ఐ నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

తంగళ్ళపల్లి మండలం తాడూరి గ్రామానికి చెందిన సాసాల లక్ష్మి అనే మహిళ తన ఇంటికి తాళం వేసి తన కుమార్తె వద్దకు వెళ్లిన సమయంలో, మార్చి 30 తెల్లవారు జామున గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి ఆభరణాలు, రూ.3 వేల నగదును అపహరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఉపేంద్ర చారి కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు, మండపెళ్లి గ్రామ శివారులో వారిని పట్టుకున్నారు. విచారణలో వారు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్గర్ పాషా (21), సనుగుల గ్రామానికి చెందిన పిట్టల అరవింద్ (20), వేములవాడ మండలం సుభాష్ నగర్‌కు చెందిన సామల బాలకిషన్ (20)గా గుర్తించారు. వారి వద్ద నుంచి దొంగిలించిన 2 తులాల బంగారు ఆభరణాలు మరియు 11 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్

నిందితులపై సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్ అజ్గర్ పాషాపై 21 కేసులు, పిట్టల అరవింద్‌పై 8 కేసులు, సామల బాలకిషన్‌పై 6 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.

కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి మరియు పోలీస్ సిబ్బంది సంపత్, అరవింద్, శ్రీనివాస్‌లను సి.ఐ అభినందించారు.