కుల్ల్సుంపురాలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి; ఇద్దరు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ | మార్చి 18, 2026: ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ పచ్చళ్లను తయారు చేస్తున్న ఒక స్థావరంపై కులసుంపురా పోలీసులు దాడి చేసి, భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలు: ఈరోజు (18-03-2026) కులసుంపురా సబ్-ఇన్స్పెక్టర్ ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి జియాగూడ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా, వెంకటేశ్వర నగర్లోని (ఇంటి నం. 13-3-596/C/1) ఒక గోదాములో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించారు. అక్కడ సోదాలు నిర్వహించగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు (License) లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు తేలింది. నిందితులు కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలను ఉపయోగిస్తూ పచ్చళ్లను తయారు చేసి, స్థానిక దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:

72 డ్రమ్ముల వివిధ రకాల పచ్చళ్లు (నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, మరియు గోంగూర).
06 డ్రమ్ములు టమోటా మరియు చింతపండు పేస్ట్.
01 చిన్న డ్రమ్ము అల్లం వెల్లుల్లి పేస్ట్.
01 ఎలక్ట్రానిక్ బరువు తూచే యంత్రం.
నిందితుల వివరాలు:
ఎన్. నరసింహ (54), తండ్రి: దివంగత రాములు, నివాసం: జియాగూడ, హైదరాబాద్.
ఎన్. నరేష్ (45), తండ్రి: దివంగత రాములు, నివాసం: జియాగూడ, హైదరాబాద్.
ఈ మేరకు నిందితులపై కులసుంపురా పోలీస్ స్టేషన్లో Cr. No. 85/2026 U/s 318(4), 274, 275 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాము. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఇలాంటి అక్రమ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.
