Breaking News

గోషామహల్ డివిజన్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాలలో భద్రత పెంపు – సిసిటివి కెమెరాల ప్రారంభోత్సవం.

గోషామహల్ డివిజన్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతాలలో భద్రత పెంపు – సిసిటివి కెమెరాల ప్రారంభోత్సవం.

హైదరాబాద్: ప్రజల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో, గోల్కొండ జోన్ డిసిపి శ్రీ జి. చంద్రమోహన్ ఈరోజు గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఏసిపి శ్రీ ఎస్. సుదర్శన్, ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

వివరాలు:

దర్గా హజ్రత్ సయ్యద్ అహ్మద్ షా ఖాద్రీ (R.A.): ఉర్స్ సందర్భంగా 04 కెమెరాల ఏర్పాటు.

తెలంగాణ కొత్త డీజీపీ ఎంపికకు యూపీఎస్సీ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

శ్రీ ఉజ్జలి మాతా మహంకాళి ఐదు దేవాలయాలు (TTI గోషామహల్ సమీపంలో): 08 కెమెరాల ఏర్పాటు.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో సిసిటివి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పండుగలు, విశేష సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే చోట నిరంతర నిఘా అవసరమని ఆయన తెలిపారు. ఈ కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచవచ్చని మరియు ఏదైనా సంఘటన జరిగినప్పుడు దర్యాప్తుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని వివరించారు. భక్తులు ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు చేసుకునేలా చూడటమే పోలీస్ శాఖ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశాeru.
Issued by డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం,గోల్కొండ జోన్, హైదరాబాద్ సిటీ పోలీస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *