Breaking News

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల తండా సర్పంచ్ వర్థ్య శాంతమ్మపై సస్పెన్షన్ వేటు పడింది.

ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సర్పంచ్ శాంతమ్మ కుమారుడు బాబు నాయక్, ఆయన అనుచరులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, గత డిసెంబర్ 25న పంచాయతీ ఆవరణలోని ప్రహరీ, గేటు, టాయిలెట్లు, చెట్లను నరకడం, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినట్లు పంచాయతీ అధికారి డిసెంబర్ 29న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం, పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం, చెట్లను నరకడం నేరమని చెబుతూ జనవరి 12న సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

సర్పంచ్ 19న సమాధానం ఇవ్వగా, పరిశీలించిన కలెక్టర్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆరు నెలల పాటు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అప్పటి వరకు ఉపసర్పంచ్ సభావత్ కవిత సర్పంచ్ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *