శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: సెంట్రల్ పీస్ కమిటీ సభ్యులతో చార్మినార్ జోన్ డిసిపి ఖారే కిరణ్, సమన్వయ సమావేశం
హైదరాబాద్: రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి మరియు నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి చార్మినార్ జోన్ డిసిపి ఖారే కిరణ్, సంజరీ కన్వెన్షన్లో ‘సెంట్రల్ పీస్ కమిటీ’ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి మరియు ఏసిపిలు కూడా పాల్గొన్నారు.
రాబోయే రంజాన్ మాసంతో పాటు ఇతర పండుగల సమయంలో మతపరమైన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. జోన్ పరిధిలో మత సామరస్యాన్ని కాపాడటం, ప్రజా రక్షణ మరియు ట్రాఫిక్ మేనేజ్మెంట్పై కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.Mఅసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు మరియు సమాజ పెద్దలకు మధ్య సమన్వయం చాలా అవసరమని పేర్కొన్నారు. రంజాన్ సమయంలో శాంతిని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పీస్ కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి ఎం.ఏ. మజీద్, ఆల్ జోన్స్ జనరల్ సెక్రటరీ శ్రీకిషన్ శర్మ, చార్మినార్ జోన్ ప్రెసిడెంట్ కె.ఏ. మోయిజ్, జనరల్ సెక్రటరీ డా. జైన్, పేట్రన్ హఫీజ్ ముజఫర్ హుస్సేన్, ట్రెజరర్ నర్సింగ్ గౌడ్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
