సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి 1 బైక్తో పాటు 2 ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన రాయికోడ్ ఎస్ఐ ఎం. చైతన్య కిరణ్ మరియు పోలీస్ సిబ్బంది పనితీరును జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల మే 9న సంగాపూర్ గ్రామానికి చెందిన కాపాడి సుమన్ గౌడ్ తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని రాయికోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు.
అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడి వద్ద నుంచి 1 బైక్ మరియు 2 ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు.
అరెస్టైన నిందితుడు నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన పండరి గౌడ్గా గుర్తించారు. నిందితుడిపై గతంలో కూడా పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం చోరీ కేసు, నారాయణఖేడ్ పరిధిలో బంగారు ఆభరణాల చోరీ కేసు, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయ చోరీ కేసులతో పాటు మరికొన్ని కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు.
