Breaking News

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి సంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక పోక్సో న్యాయమూర్తి ఆర్. శ్రీలేఖ విచారణ అనంతరం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.

ఈ కేసులో నిందితుడు శాంసన్ @ మేథారి శాంసన్‌పై క్రైమ్ నం.45/2023 కింద ఐపీసీ సెక్షన్లు 366, 376(2)తో పాటు పోక్సో చట్టం సెక్షన్ 3 & 4 ప్రకారం కేసు నమోదు చేశారు. విచారణలో ఆరోపణలు రుజువుకావడంతో కోర్టు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.8,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 5 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

నిందితుడు శాంసన్ (20), వృత్తి ఎలక్ట్రిషియన్ మరియు సెంట్రింగ్ పనులు చేస్తూ, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరా ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు.

పశువుల అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిక

ఈ కేసును సమర్థవంతంగా నడిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. సూర్యరెడ్డి, దర్యాప్తు అధికారి కె. నవీన్ కుమార్, ఎస్‌హెచ్‌వో డి. వెంకటేష్, సదాశివపేట పోలీస్ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు శంకర్, సత్యనారాయణలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *