నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన హెడ్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ కుటుంబానికి తెలంగాణ పోలీస్ శాఖ ఆర్థిక సహాయం అందజేసింది
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, విధుల్లో ఉండగా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన “తెలంగాణ పోలీస్ విధవ నిధి (Widow Corpus Fund)” ద్వారా రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) మంజూరు చేయబడింది.
ఈ మేరకు మంజూరైన చెక్కును నజీరుద్దీన్ గారి సతీమణి శ్రీమతి షాహినా బేగం గారికి నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీస్ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి సేవలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. విధుల్లో ఉండగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, వారి సంక్షేమం కోసం పోలీస్ శాఖ నిరంతరం సహకారం అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ షబ్బీర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
