Breaking News

సంగారెడ్డి జోగిపేట సబ్ జైల్‌లో ట్రాన్సిట్ హోం నిర్మాణ పనులు పరిశీలించిన ఐజీ ఎం. శ్రీనివాస్

సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైల్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం) నిర్మాణ పనులను ఐజీ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న పనులను సమగ్రంగా తనిఖీ చేసి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

విదేశీయులు సౌకర్యవంతంగా ఉండే విధంగా అన్ని సదుపాయాలతో ట్రాన్సిట్ హోంను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాణ పనులు నాణ్యతగా, సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సూర్యాపేట సబ్ జైలు తనిఖీ: ఖైదీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి – డీజీ సౌమ్య మిశ్రా

ఈ పరిశీలన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీసీపీ కృష్ణ చైతన్య, డీఎస్పీ సత్తయ్య గౌడ్, జోగిపేట ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *