వార్త:
హైదరాబాద్లో “అరైవ్ అలైవ్” రహదారి భద్రత ప్రచారంలో భాగంగా ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ శిబిరాన్ని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సహకారంతో చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆటో, బస్సు మరియు క్యాబ్ డ్రైవర్లకు సురక్షిత డ్రైవింగ్కు అవసరమైన కంటి పరీక్షలు నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు ఎంత ముఖ్యమో వివరించడంతో పాటు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
సుమారు 50 మంది డ్రైవర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొని తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. రోడ్డు భద్రతలో భాగంగా డ్రైవర్ల ఆరోగ్యం కూడా కీలకమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంతోష్నగర్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ పర్యవేక్షించారు.
Tags:
