Breaking News

పోలీస్ గ్రీవెన్స్ డే లో ప్రజా సమస్యల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ .

పోలీస్ గ్రీవెన్స్ డే లో ప్రజా సమస్యల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ .

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 30 మంది బాధితులు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి ప్రత్యక్షంగా వివరించారు.

గ్రీవెన్స్ డే సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు సహా పలు అంశాలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజలు తెలిపిన సమస్యలను జిల్లా ఎస్పీ విని, సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ..

ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.

పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *