Breaking News

29 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ: 29 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు
వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 29 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ధారూర్ సర్కిల్ సి.ఐ. సిహెచ్. రఘురాములు, మోమిన్‌పేట్ ఎస్.ఐ. ఎం. అరవింద్లు తమ విధుల్లో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా ప్రశంసలు అందుకున్నారు. డి.పి.ఓ. కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్లు మొహమ్మద్ అయూబ్, ఎం. సాయి ప్రసాద్, ఐటీ సెల్ నుండి ఎం. కేశవులు సేవలను అధికారులు అభినందించారు.
జిల్లాలోని వివిధ ప్రత్యేక విభాగాల నుంచి జి. కృష్ణ (DCRB), ఎస్. ప్రమీల, కె. మీన (DSB), టి. రామకృష్ణ (క్లూస్ టీమ్), ఎం. పార్వతీశం (PCR), పి. చంద్ర శేఖర్ (DTC)లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే సామాజిక సేవలలో భాగంగా భరోసా కేంద్రం సపోర్ట్ పర్సన్ జి. హెప్జిబా, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ వి. రమేష్లకు కూడా గౌరవం దక్కింది.
వివిధ పోలీస్ స్టేషన్లలో క్షేత్రస్థాయిలో విశేష సేవలందించిన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లలో జమీల్ (చెంగోముల్), రమేష్ వర్మ (కొడంగల్), ఎస్. గోపాల్, ఎండి. జహంగీర్ పాషా (పరిగి), బలరామ్ (మోమిన్‌పేట్), నర్సిములు (వికారాబాద్), రఘు రాములు (ధారూర్), జయవర్ధన్ (CCS), జె. సాయికృష్ణ యాదవ్ (తాండూర్), బి. అశోక్ కుమార్ (కరంకోట్), ఎం. శ్రీనివాస్ (యాలాల), కె. నాగేంద్ర (బషీరాబాద్)లకు పురస్కారాలు అందజేశారు.
అలాగే డి.ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్. వెంకటయ్య, శేఖర్, బి. జగ్గమ్మ, యు. సత్యనారాయణలు కూడా ఉత్తమ పనితీరు కనబర్చిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, విధి పట్ల నిబద్ధతతో పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.

Hyderabadలో రోడ్డు భద్రత లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ – 506 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *