Breaking News

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ ఆత్మను పరిరక్షిస్తూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Hyderabadలో రోడ్డు భద్రత లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ – 506 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

ఈ కార్యక్రమంలో అడిషనల్ రమేష్ నల్గొండ డి.ఎస్.పి శివరాంరెడ్డి,ఎస్బి సిఐ రాము, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి,ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐ సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *