• 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం..
• సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్
• ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.
• ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగిందని, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరేడ్ గ్రౌండ్స్లో జాగిలాలతో, బాంబ్ స్క్వాడ్ల బృందాలతో తనిఖీలు చేయిస్తూ.., అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు.
ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రధాన అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

