సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి ..*

గ్రామపంచాయతీ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు నియోగించుకుంటకు ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన పెద్దవూర, హాలియా,పులిమామిడి గ్రామాలలోని ప్రజలకు ఎన్నికల నిబంధనల పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలలో పంచాయతీలో ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి విభేదాలకు పోకుండా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఎన్నికలు వచ్చిపోతుంటాయి గ్రామంలో ఉండాల్సినవి ప్రజలు,కావున ప్రజలు అందరూ కలిసి ఉండాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుటకు దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రశాంతగా ఓటు వినియోగించుకొని వెళ్లాలని అన్నారు. గత ఎన్నికల్లో గొడవలు సృష్టించే వారిని ఇప్పటికే బైండవ చేయడం జరిగిందని వారి పై ప్రత్యేక నిఘా ఏర్పటు చేశామని అన్నారు. మళ్ళీ గొడవలకు కారకులు అయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో నగదు, మద్యం,ఉచిత పంపిణీలు లాంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టే మధ్యం,నగదు ఉచితాలు పంపిణి చేయకూడని అన్నారు. ఎవరైనా అలాంటి చర్యలకు పట్టుబడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి కోరారు.
ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ డియస్పి రాజశేఖర్ రాజు, హాలియా సీఐ సతీష్ రెడ్డి, హాలియా ఎస్. ఐ సాయి ప్రశాంత్,పెద్దవూర ఎస్.ఐ ప్రసాద్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
