గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలి జిల్లా యస్పి శరత్ చంద్ర పవర్ ఐపీఎస్*
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం
ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలు, నిబంధనలు పాటించాలి
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్ట్యా, ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని అన్నారు..
చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రంపల్లి,సుంకనేపల్లి,ఏపూరు గ్రామాల ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని,ఎలాంటి గొడవలు, గ్రూప్ తగాదాలు, ర్యాలీలు, అల్లర్లు జరుగకుండా పోలీసులకు సహకరించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలుఅమల్లో ఉన్నందున ఎవరైనా ఓటర్లను బెదిరించడం, బలవంతం చేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామల్లో డబ్బు,మద్యం బహుమతులు పంపిణీ సరఫరా చేయకూడదని ప్రజలు కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు తలోగ్గకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ పటిష్ట కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ప్రలోబాలకు గురి చేసిన డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ను తెలిపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నార్కట్ పల్లి సిఐ నాగరాజు,చిట్యాల ఎస్ఐ మధుబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
