మహబూబ్ నగర్ పోలీసులు–నేషనల్ హైవే అథారిటీ సంయుక్త పరిశీలన
ప్రమాద ప్రాంతాల గుర్తింపు – రోడ్డు భద్రత కోసం చర్యలు వేగవంతం
ప్రజల భద్రతే ప్రాధాన్యం డీఎస్పీ వెంకటేశ్వర్లు
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు, ఈరోజు డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున, రాజాపూర్–బాలానగర్ ఎస్సైలు మరియు నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి బాలానగర్ బార్డర్ నుండి జడ్చర్ల టౌన్ వరకు రోడ్ సేఫ్టీ ప్రత్యేక పరిశీలన నిర్వహించారు.

పరిశీలనలో భాగంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సందర్శించి, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను గుర్తించారు. గుర్తించిన ప్రాంతాల్లో రోడ్డు భద్రత కోసం అవసరమైన ఏర్పాట్లపై పోలీస్ శాఖ మరియు నేషనల్ హైవే అథారిటీ సంయుక్తంగా సమావేశమై చర్యలు తీసుకునే అంశాలను ఖరారు చేశారు.
ప్రమాద సూచిక బోర్డుల ఏర్పాటు
రేడియం స్టిక్కర్లు అమరిక
డబుల్ స్టెప్ లైన్ల గుర్తింపు
హెచ్చరిక సైన్ బోర్డుల ఏర్పాటు
స్పీడ్ నియంత్రణ సూచనల బలోపేతం
వంటి భద్రతా ఏర్పాట్లు అత్యవసరంగా చేయాలని సంబంధిత విభాగాలకు వివరించబడింది.

డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ “ప్రతి వాహనదారుడి భద్రత అత్యంత ముఖ్యమైనది. ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు నిర్మాణం, సూచికలు, హెచ్చరికలు సమర్థంగా ఉండాలి. అలాగే ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నియంత్రించగలం. రోడ్ సేఫ్టీ కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరం.”
PRO
