Breaking News

పోలీస్ సిబ్బంది నైపుణ్యాభివృద్ధి శిక్షణను పరిశీలించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్

పోలీస్ సిబ్బంది నైపుణ్యాభివృద్ధి శిక్షణను పరిశీలించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్

హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ శుక్రవారం తమ పోలీస్ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న ‘ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం’ అనే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించి, పరిశీలించారు.
కమిషనర్ హైదరాబాద్‌లోని పేట్ల బురుజు మరియు చేలపుర సిటీసీ (CTC) శిక్షణా కేంద్రాలకు అకస్మాత్తుగా వెళ్లారు. అక్కడ శిక్షణ జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ ఒక్క రోజు శిక్షణా కార్యక్రమానికి హోంగార్డు స్థాయి నుండి సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) స్థాయి వరకు సుమారు 350 మంది పోలీస్ సిబ్బంది రెండు కేంద్రాలలో హాజరయ్యారు. చార్మినార్ డివిజన్, మీర్ చౌక్ డివిజన్, కార్ హెడ్ క్వార్టర్, హోం గార్డ్ ఆఫీస్ సిబ్బందితో పాటు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఈ శిక్షణలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్ శిక్షణకు హాజరైన సిబ్బందితో మాట్లాడి, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ ఇస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ నాణ్యత, సిబ్బంది భాగస్వామ్యంపై ఆయన అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ హెడ్ క్వార్టర్స్ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, అడిషనల్ డీసీపీలు శ్రీ బి. కిష్టయ్య, శ్రీ ఎన్. భాస్కర్ లు పాల్గొన్నారు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు..

పిఆర్ఓ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ సిటీ పోలీస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *