తెలంగాణ : కొత్తగా నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఇవాళ సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు. గోషామహల్ స్టేడియంలో 26.3 ఎకరాల్లో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఇందులో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, మల్టీలెవెల్ పార్కింగ్, గార్డెన్లు, లేటెస్ట్ టెక్నాలజీ మార్చురీ, వెయిటింగ్ హాల్ వంటివి ఏర్పాటు చేయనున్నారు.
